చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుపడ్డ పోలీస్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ దొంగగా మారిపోయాడు. కృష్ణా జిల్లా కైకలూరులో రాత్రి ఇద్దరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు. అందులో ఒకరు ఉండి పొలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యనారాయణ. 2018 నుంచి ఉండి పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణ విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్ గా పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కైకలూరులో మహిళ మెడలోని చైన్ తెంపుకొని వెళ్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)