'గ్రీన్‌ హైడ్రోజన్‌' కారులో పార్లమెంటుకు వచ్చిన గడ్కరీ

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం పార్లమెంటుకు వచ్చిన ఓ కారు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆయన తన నివాసం నుంచి ప్రయోగాత్మకంగా 'గ్రీన్‌ హైడ్రోజన్‌'తో నడిచే కారులో ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. దేశంలోనే ఇలాంటి తరహా వాహనాల్లో ఇది మొదటిదిగా చెబుతున్నారు. కిలో మీటరు ప్రయాణానికి కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, ఒక ఫుల్‌ ట్యాంకుతో 600 కిలో మీటర్లు ప్రయాణించొచ్చని తెలుస్తోంది. ఈ కారుకు విద్యుత్తు వాహనాలకు వినియోగించే హరిత వర్ణపు సంఖ్యా ఫలకం అమర్చారు. తెలుపు రంగులో ఉన్న ఈ కారులో డ్రైవరు పక్కన కూర్చుని గడ్కరీ ప్రయాణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)