ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నహెపటైటిస్ కేసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో హెపటైటిస్ (లివర్ సంబంధిత వ్యాధి) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆస్పత్రుల్లో హెపటైటిస్ కు వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 11 బోధనా ఆస్పత్రులు, 2 జిల్లా ఆస్పత్రుల్లో హెపటైటిస్ కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్ తో పాటు వైద్యం చేస్తున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఇకపై అన్ని జిల్లా ఆస్పత్రుల్లో హెపటైటిస్ కు సంబంధించిన వైద్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 26 ఆసుపత్రుల్లో హెపటైటిస్ బీ, సీ వ్యాధులకు గురైన వారికి వైద్యం అందనుంది. నిర్ధారిత కేసుల వివరాలను ఎప్పటికప్పుడు 'నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పోర్టల్'కు అనుసంధానం చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)