వారణాసిలో భారీ రోడ్ షో లో మోదీ టీ బ్రేక్

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మార్చి 07వ తేదీన జరిగే పోలింగ్ తో ఎన్నికలు ముగియనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఏడో దశ పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానంగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాషాయ అగ్రనేతలు యూపీలో మకాం వేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో పర్యటించారు. భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని టూర్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. నరేంద్రమోదీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. రోడ్‌ షో మధ్యలో ఓ టీస్టాల్కు వెళ్లి మట్టి గ్లాసులో ఇచ్చిన చాయ్ తాగుతూ కాసేపు సేదదీరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)