మెక్సికో కాల్పుల్లో 19 మంది మృతి

Telugu Lo Computer
0


సెంట్రల్ మెక్సికోలోని మిచోవాకాన్ స్టేట్ పరిధిలో ఉన్న లాస్ టినాజస్ పట్టణంలో జరిగిన కాల్పుల్లో 19 మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అక్కడి అధికారుల సమాచారం మేరకు సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనలో మరికొందరు గాయపడగా, వీరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఒక వేడుక సందర్భంగా కొందరు గుమిగూడారు. అప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు. మెక్సికోలో ఎక్కువ హింస జరిగే ప్రాంతాల్లో మిచోవాకాన్ ఒకటి. ఇక్కడ రెండు వర్గాలు నిత్యం కాల్పులు జరుపుకొంటూ ఉంటాయి. కాల్పుల్లో ప్రతి ఏటా వందల మంది మరణిస్తుంటారు. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,40,000 మందికి పైగా మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)