అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సికింద్రాబాద్‌ బోయిగూడ సమీపంలో ఓ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మంటల్లో చిక్కుకుని మరణించిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలుగా భావిస్తున్నారు. బుధవారం ఉదయం 8 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే మంటలు ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక శాఖ అధికారులు లోపల ఇంకా ఎంత మంది ఉన్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. రెండస్తుల స్క్రాప్ గోడౌన్లో మొత్తం 12 మంది ఉన్నారు. వారు అక్కడే పని చేస్తూ, అందులోనే పడుకుంటారు. వారిలో ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎనిమిది ఫైర్ ఇంజన్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు చనిపోవడంపై కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మృతు కుటుంబాకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసిఆర్ ప్రకటించారు.ప్రమాదంలో ప్రాణాు కోల్పోయిన బీహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సీఎస్ సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)