యువతికి మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్?

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉద్యోగ ఇంటర్వ్యూ కి వెళ్లిన 25 సంవత్సరాల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటర్వ్యూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేసి ఆమె కాళ్లు తాడుతో కట్టేసి మత్తు ఎక్కించారు. అనంతరం ఆమె మత్తులో కింద పడి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా యువతిని మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందకు పడేసారు. యవతికి కట్టిన తాడు స్తంభానికి తట్టుకోవడం తో ఆమె ప్రాణాలతో బయట పడిందని పోలీసులు తెలిపారు. బాధితురాలు తన పై దేవేంద్ర సింగ్, విక్రమ్ సింగ్ తో పాటు మరో ఇద్దరు భవానీ సింగ్, సునీల్ రాజ్‌పుత్‌లు అత్యాచారానికి పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)