భార్యను కౄరంగా చంపినా భర్త?

Telugu Lo Computer
0


బీహార్‌లోని బంకా జిల్లా ధోరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాహిర్‌పూర్ గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్, రీమా దేవి భార్యా భర్త. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొంతకాలంగా హేమంత్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. కోడలి వరసయ్యే ఓ మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి వ్యవహారం రీమా దృష్టికి వచ్చింది. ఇలా చేయడం తప్పని భర్తకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయమై ఇరువరి మధ్య నిత్యం గొడవలు జరుగేవి. స్థానిక ప్రజా ప్రతినిధులు పంచాయితీ నిర్వహించి ఇద్దరికీ సర్ది చెప్పారు. అయినా హేమంత్ బుద్ధి మారలేదు. అలాగే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఇటీవల మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య రీమా దేవి అడ్డు తొలగించుకోవాలని హేమంత్ నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. సాక్షాధారాలను చెరిపి వేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంట్లో భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని ఓ గోనెసంచిలో ఉంచి నది ఒడ్డున పాతిపెట్టాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. రీమా దేవి కనిపించకపోవడం తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ కేసుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీస్ కుక్కలు ఓ నది ఒడ్డునకు వెళ్లి ఆగాయి. అక్కడ తవ్వి చూడగా ఓ సంచి బయటపడింది. అందులో మానన శరీర అవయవాలు కనిపించాయి. అది రీమా దేవి మృతదేహమని నిర్ధారించుకున్న పోలీసులు భర్త కోసం గాలిస్తున్నారు. ధోరయా పోలీస్ స్టేషన్ చీఫ్ మహేశ్వర్ రాయ్ మాట్లాడుతూ హత్య అనంతరం హేమంత్, అతడి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. త్వరలోనే వారిని పట్టకుంటామని.. కఠిన శిక్ష పడేలా ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)