రికార్డు స్థాయిలో మద్యం ఆదాయం

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో ఎక్కువగా ఎక్సైజ్ శాఖ నుంచి మధ్యం విక్రయాల నుంచే వస్తోంది. మరోవైపు మందు బాబులు 'మధ్యాన్ని హాంఫట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల్లో వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఎవరికైనా మతిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల్లో మందుబాబులు రూ. 47 వేల కోట్ల విలువైన మద్యాన్ని తాగారు. తెలంగాణలో రూ. 25,238 కోట్ల విలువైన 3.07 కోట్ల కేసుల లిక్కర్ , 2.71 కోట్ల కేసుల బీరు అమ్ముడైంది. ఏపీలో రూ. 21,169 కోట్ల విలువైన 2.13 కోట్ల కేసుల లిక్కర్, 62.90 లక్షల కేసుల బీరు విక్రయం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.10 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)