విశాఖలో నిన్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలపై విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ను గంటల తరబడి నిలిపి వేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణ చేసి భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందిపడ్డ విశాఖ ప్రజలు!
February 10, 2022
0
Tags