యూట్యూబ్‌ నటి సరయుపై కేసు నమోదు?

Telugu Lo Computer
0


ప్రముఖ యూట్యూబ్‌ నటి సరయుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ ప్రచారపాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని రాజన్న సిరిసిల్ల వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. హోటల్‌ ప్రచార పాటలో నటి సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ పాటతో పంపుతున్నారని తెలిపారు. ఈ విధంగా హిందువుల మనోభావాలను కించపరిచేలా తీసినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)