పెరూలో ఘోర విమాన ప్రమాదం

Telugu Lo Computer
0


పెరూలో విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నాజ్కాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. పర్యాటకులను తీసుకెళుతున్న ఈ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పైలెట్, కో పైలట్ కూడా మరణించారు. ఈ విమానం ఏరో శాంటాస్ పర్యాటక సంస్థ కు చెందిందిగా అధికారులు చెప్పారు. విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. తేలికపాటి విమానం ప్రమాదానికి గురైన కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో విమాన ప్రమాదం జరగడం విషాదాన్ని మిగిల్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)