చెన్నైమెరీనా బీచ్లో స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లిన అన్నదమ్ములు అలల్లో చిక్కుకొని మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. తిరు నిండ్రవూర్కు చెందిన ఆకాష్ (15), హారీస్ (13) అనే సోదరులు శనివారం మధ్యాహ్నం తమ స్నేహితులతో కలసి మెరీనా బీచ్కు వెళ్లారు. వారు సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన అలలో చిక్కుకొని వారివురు గల్లంతయ్యారు. దీనిపై అందిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సముద్రంలో గాలించి వారి మృతదేహాలు వెలికితీశారు. ఈ ఘటనపై మెరీనా బీచ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మెరీనాబీచ్లో స్నానానికి వెళ్లి ఇద్దరి మృతి
February 28, 2022
0