బెంజ్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని

Telugu Lo Computer
0


కేరళకు చెందిన ఓ సంస్థ యజమాని తన దగ్గర పనిచేసిన ఉద్యోగికి మెర్సిడెస్ బెంజ్  కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. తన యజమాని ఇంత ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చేసరికి ఆ ఉద్యోగి ఆనందానికి అవధుల్లేవు. ఈ వార్త ఇప్పుడు కేరళలో చర్చనీయాంశమైంది. మరి అంత ఖరీదైన కారును ఎందుకు బహుమతిగా ఇచ్చారంటే ఆ ఉద్యోగి ఆ సంస్థకు 22 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌లో ఓ ఉద్యోగి ఓ సంస్థలో ఏడాది పనిచేయడమే గొప్ప. కానీ ఓ ఉద్యోగి ఒకే సంస్థలో 22 ఏళ్ల పాటు సేవలు అందించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే తన సేవలకు గుర్తుగా ఈ బహుమతి దక్కింది తన యజమాని నుంచి ఇంత ఖరీదైన కారు బహుమతిగా అందుకున్న ఉద్యోగి పేరు సీఆర్ అనీష్. కేరళకు చెందిన వ్యాపారవేత్త అయిన ఏకే షాజీ దగ్గర 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఏకే షాజీకి MyG పేరుతో డిజిటల్ రీటైల్ స్టోర్ ఉంది. ఈ స్టోర్‌లో అనీష్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అనీష్ ఇదే సంస్థలో 22 ఏళ్లుగా పనిచేస్తుండటం విశేషం. రెండు దశాబ్దాలకు పైగా అందిస్తున్న సేవల్ని గుర్తించి, అతని విశ్వాసానికి బహుమతిగా ఏకే షాజీ Mercedes-Benz GLA Class 220d మోడల్ కారును ఇచ్చారు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.45 లక్షలు కాగా, ఆన్‌రోడ్ ధర రూ.50 లక్షలకు పైనే ఉంటుంది. "డియర్ అనీ, 22 ఏళ్లుగా మీరు నాకు బలమైన స్తంభంగా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాను" అని సదరు వ్యాపారవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో తన ఉద్యోగికి ఇచ్చిన లగ్జరీ బెంజ్ కార్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. "మీరు ఉద్యోగి కాదు. మనం భాగస్వాములం. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇది గర్వించదగిన క్షణం. అనీ గత 22 ఏళ్లుగా నాతోనే ఉన్నాడు. ఈ సంవత్సరం మన భాగస్వాములకు మరిన్ని కార్లను అందించగలమని ఆశిద్దాం" MyG యజమాని ఏకే షాజీ చెప్పడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)