మధ్యాహ్నం భోజనం కాగానే వెంటనే నిద్రపోతున్నారా?

Telugu Lo Computer
0


మధ్యాహ్నం పూట భోజనం కాగానే చాలా మంది నిద్రపోతుంటారు. అలా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిదే అనుకుంటుటే పొరపాటు పడినట్లే. మధ్యాహ్న భోజనం చేయగానే నిద్ర రావడం సహజమే.  కానీ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత నిద్ర పోతే కొన్ని సమస్యలు వస్తాయి. అలా నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే పడుకున్న సమయంలో కడుపులో నుంచి కొంత మొత్తంలో జీర్ణరసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు ప్రవహిస్తాయి. దాని ఆమ్ల స్వభావం కారణంగా భోజనం నేరుగా గొంతు, నోటిలో మంటను కలిగిస్తుంది. భోజనం తర్వాత వెంటనే నిద్రపోకుండా ఉండాలి. ఎందుకంటే పడుకున్న సమయంలో ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తేవడం వల్ల గురక వస్తుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఒక గంట ఆగి నిద్రపోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని గ్రీస్ లోని యూనివర్సిటీ ఐయోనిన మెడికల్ స్కూల్ లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందుకే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కేవలం 45 నిమిషాలు మాత్రమే నిద్రపోవాలి. అంతకుమించి నిద్రపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)