పీఆర్సీపై అసంపూర్తిగా ముసిగిన చర్చలు!

Telugu Lo Computer
0


పీఆర్సీ అంశంపై మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతల చర్చలు అసంపూర్తిగా ముగిసింది. మంత్రుల కమిటీ ముందు స్టీరింగ్ కమిటీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. దీనిపై చర్చించి మళ్లీ చెప్తామని మంత్రులు కమిటీ పేర్కొంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, రికవరీ అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే జనవరి నెల పాత వేతనాలపై మంత్రుల కమిటీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్‌, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వచ్చినందున స్టీరింగ్ కమిటీ వెళ్లింది.


Post a Comment

0Comments

Post a Comment (0)