పెళ్లైన వారానికే ఎస్సై దుర్మరణం !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని వికారాబాద్ పోలీస్ ఎస్సై శ్రీను నాయక్, డిసెంబర్ 26వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అత్తారింటి నుంచి ఒడిబియ్యం తీసుకువెళ్లడానికి ఆటోలో కలిసి తన తండ్రితో వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఎస్ఐ శ్రీను నాయక్ తన తండ్రి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలియజేశారు. అయితే ఎస్ఐ శ్రీను నాయక్ తండ్రి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు. తన చేతికి గాయం కావడంతో శ్రీను నాయక్ స్వయంగా ఆటో నడిపారు. ఎస్సై శ్రీను నాయక్ కి వారం కిందట వివాహం జరగడంతో వారి ఆచారం ప్రకారం అత్తారింటి నుంచి ఒడి బియ్యం తీసుకు వెళ్ళడం కోసం వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)