హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట శివనగర్ ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉండే మరి పల్లి సిద్దయ్య గౌడ్ కుమార్తె కావేరి (19)కి ఈనెల 3వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కానీ అత్తగారింటికి వెళ్ళలేదు. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లగా జనవరి 6 వ తేదిన ఆమే ఒక్కటే ఇంట్లో ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి కనిపించకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తుంది. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి సోమవారం పోలీసులను ఆశ్రయించింది. దీంతో తల్లి సంగీత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన నవ వధువు
January 17, 2022
0
Tags