తహసీల్దార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు!

Telugu Lo Computer
0


తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి దొంగలు పడ్డ ఘటన హైదరాబాద్ లోని బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది మొదటి అంతస్తుకు వెళ్లే ప్రధాన గ్రిల్కు ఉన్న తాళం విరిగిపడి కింద ఉండడంతో అవాక్కై ఎమ్మార్వోకు సమాచారం అందించారు. వెంటనే ఎమ్మార్వో పోలీసులకు తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరించారు. ఘటనపై ఎమ్మార్వో ఎస్. రాములు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో కార్యాలయంలోని మొదటి అంతస్తుకు వెళ్లే ప్రధాన గ్రిల్ కు ఉన్న తాళాన్ని రాడు సాయంతో తొలగించి ప్రధాన కార్యాలయంలోకి దుండగులు ప్రవేశించి ఉంటారని ఆయన అన్నారు. ప్రధాన కార్యాలయంలోని బీరువా తెరిచి ఫైళ్ళను చిందరవందర చేశారని ఆయన తెలిపారు. కంప్యూటర్‌కు సంబంధించిన మానిటర్ ఎత్తుకెళ్లారని దుండగులు ఏ ఉద్దేశంతో చోరికి పాల్పడ్డారో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దస్తావేజులకు సంబంధించిన మరో కార్యాలయంలో ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలోని నాలుగు  ప్రధాన ద్వారాల తాళాలను రాడు సాయంతో తొలగించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బహదూర్ పుర పీఎస్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది అని ఎమ్మార్వో అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)