బెంగళూరులోనే మూడింతల కోవిడ్ కేసులు

Telugu Lo Computer
0


కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరును కొవిడ్‌ కుదిపేస్తోంది. రెండు రోజుల వ్యవధిలో 1500కు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 832 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 656 మందికి వైరస్‌ సోకింది. 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 16 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. ఉడుపిలో 35, దక్షిణకన్నడలో 30, కొడగులో 21, బెళగావిలో 12, హాసన్‌లో 11 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 335 మంది కోలుకోగా 8 మంది మృతి చెందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)