సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 ప్రారంభం !

Telugu Lo Computer
0


ఏపీ సేవా పేరుతో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 ప్రారంభం చేశారు. ఈ సేవల్ని మరింత మెరుగుపరిచేందుకే పోర్టల్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్ర్రి వై.ఎస్. జగన్ తెలిపారు. దీంతో వేర్వేరు శాఖలన్నీ ఒకే పోర్టల్ కిందకు వస్తాయి. మారుమూల గ్రామాల్లోనూ సేవల్లో వేగం పెరుగుతుందని సీఎం చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత వేగంగా జరగనున్నాయి. గ్రామ స్వరాజ్యానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గొప్పగా పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ సేవల్ని మరింత మెరుగుపరిచేందుకే పోర్టల్ అని జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3.46కోట్ల మందికి మేలు జరుగుతుందని చెప్పారు. పౌర సేవలు మరింత వేగంగా జరుగుతాయని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)