జగన్‌ హత్యకు కుట్ర జరుగుతుంది : ప్రకాశ్‌రెడ్డి

Telugu Lo Computer
0



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహనరెడ్డి  హత్యకు కుట్ర జరుగుతుందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడానికి సీఎం జగన్‌ను చంపాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తండ్రి లాగా జగన్‌ కూడా గాల్లో కలిసిపోతారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కొడాలి నాని, అంబటి, వంశీలను చంపితే రూ.50లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు అంటున్నారని పేర్కొన్నారు. హింసా రాజకీయాలకు, స్కాంలకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నారని , స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ. 242 కోట్లను షెల్‌ కంపెనీలకు మళ్లించారని ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)