సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోకి అనధికార వ్యక్తులకు నో ఎంట్రీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ ఈ మేరకు మెమో జారీ చేశారు.  అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది. ఏసీబీ అబ్జర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ తెలిపారు. అందుకే అనధికారిక వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా చిత్రీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఫేక్‌గాళ్లు రెచ్చిపోయి అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొట్టిన సంగతి తెలిసిందే.. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద స్కామ్‌లు వెలుగుచూశాయి. అన్ని జిల్లాల్లోనూ స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)