పెరుగు కోసం రైలు ఆపిన లోకో పైలెట్‌

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లోని లాహోర్‌ నుంచి కరాచీ వైపు ఇంటర్ సిటీ ట్రైన్ ప్రయాణం సాగిస్తోంది. కాగా దీన్ని నడిపిస్తున్న లోకో పైలెట్ పెరుగు ప్యాకెట్ కోసం ట్రైన్‌ను నిలిపివేశాడు. అక్కడకు స్థానికంగా ఉన్న ఓ షాపు లోంచి పెరుగు ప్యాకెట్ కొనుక్కుని వచ్చి మళ్లీ రైలు ఎక్కాడు. వాస్తవానికి అక్కడ ఆ ట్రైన్ ఆపకూడదు. ఎందుకంటే రూల్ ప్రకారం అక్కడ ఆ ట్రైన్‌కు స్టాప్ లేదు. కానీ డ్రైవర్ ఇలా ఆపేయడంతో కొందరు దాన్ని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు.  ఈ వీడియో కాస్తా అధికారుల వద్దకు చేరుకుంది. దీని మీద నెటిజన్లు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా స్పందించారు. ఆ డ్రైవర్ పెద్ద తప్పు చేశారని, తాము ప్రయాణికుల భద్రత కంటే ఏదీ ముఖ్యంగా భావించమని, అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)