అవసరమైతే వారి నాలుక కోయాలి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోసేందుకు సిద్ధంగా ఉండాలని పరిటాల సునీత ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గౌరవ సభ- ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమాల్లో సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వైసీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాంటి గంభీరమైన వ్యక్తితోనే వీరు కన్నీరు పెట్టించారంటే,  వైసీపీ నేతలు అన్న మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తే కూర్చోమని, అవరసమైతే వారి నాలుకలు కోయాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపైనా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సోదరులు రాప్తాడు నుంచి పెనుకొండ వరకు భూముల సెటిల్‌మంట్స్ చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. చెన్నేకొత్తపల్లిలోని ఒక డాబాలో, అనంతపురం రూరల్ లో ఒక కళ్యాణమండపంలో, రాప్తాడులోని ఒక తోటలోని గెస్ట్ హౌసుల్లో పంచాయతీలు జరుగుతున్నాయన్నారు. సామాన్యుల మధ్య భూ తగాదాలు పెట్టి వారి డబ్బు గుంజడమే పని గా పెట్టుకున్నారని సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన సోదరులపై దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ వైసీపీ నేతలను, ఎమ్మెల్యేను పరిటాల సునీత నిలదీశారు. ఇప్పుడు హైదరాబాద్ లో 5కోట్లతో ఒక ఇళ్లు, అనంతపురంలో ఒక ఇళ్లు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)