అత్యాచార ఘటనలో ఐదుగురి అరెస్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన బాలిక కోఠి ప్రాంతంలోని ఓ పాఠశాలలో చదువుతోంది. నవంబరు 30న పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి తలిదండ్రులు సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డిసెంబరు 4న చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో బాలిక ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారించగా తనకు తెలిసిన ఆటోడ్రైవర్‌ మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి, నగర శివారులో మరో నలుగురితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. అంబర్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కిడ్నాప్‌, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)