భారత్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఒక విదేశీ స్పిన్నర్ (రెండు ఇన్నింగ్స్లు) అత్యధిక ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇది రెండోసారి. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సోమర్ విల్లే తొలి ఇన్నింగ్స్లో 24 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లు వేసిన అతను 38 పరుగులిచ్చి వికెట్ తీయలేదు. ఓవరాల్గా 40 ఓవర్లు వేసి 98 పరుగులిచ్చిన సోమర్ విల్లే ఒక్క వికెట్ తీయలేక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంతకముందు 1997-98లో టీమిండియా పర్యటనలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి 47 ఓవర్ల వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాదాపు 21 ఏళ్ల తర్వాత కివీస్ స్పిన్నర్ సోమర్విల్లే దీనిని తిరగరాశాడు.