షర్మిల పాదయాత్రకు విరామం

Telugu Lo Computer
0


వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఆమె తన పాదయాత్రను మధ్యలోనే ముగించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి తన పాదయాత్రను నార్కట్ పల్లి మండలం నుండే తిరిగి ప్రారంభిస్తాను అని ఆమె తెలిపారు. రైతుల వద్దనుంచి ప్రభుత్వం ఆఖరి గింజ వడ్లుకొనేంతవరకు పోరాడతానని ఆమె చెప్పారు. రైతుల వడ్లను చివరి గింజ వరకు కొనాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. 72 గంటల పాటు పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తానని…. తన పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతుందని ఆమె అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)