ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ నోకియా మరో ట్యాబ్లెట్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా టీ20 పేరుతో దీన్ని భారత మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. నవంబర్ 3 వరకు జరగనున్న ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్లో ఇది అమ్మకానికి రానుంది. ఈ మేరకు ఫ్లిప్కార్ట్ తన టీజర్ పోస్టర్లో నోకియా టీ20ని లిస్ట్లో చేర్చింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో విడుదలైన ఈ ట్యాబ్లెట్లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. నోకియా T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్ప్లేతో వస్తుంది. దీనిలో వర్చువల్ ఇంటరాక్షన్లను సులభతరం చేసే స్టీరియో స్పీకర్లను చేర్చింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రత్యేక గూగుల్ కిడ్స్ స్పేస్ వంటి అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. భారత మార్కెట్లో నోకియా T20 ధర తెలియనప్పటికీ, ఇది గ్లోబల్ మార్కెట్తో సమానంగా ఉండనుంది. యూరప్లో, నోకియా T20 వైఫై వేరియంట్ దాదాపు రూ. 17,200, వైఫై + 4జీ మోడల్ ధర సుమారు రూ. 20,600 నుండి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఖచ్చితంగా ధర ఎంత ఉంటుందన్న వివరాలు తెలియదు. ఫ్లిప్కార్ట్ బిగ్ దివాళీ సేల్లో ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.