విహారయాత్రా ప్రజా సంగ్రామ యాత్ర

Telugu Lo Computer
0



బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నట్టుందని ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రసమయి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ సంజయ్‌పై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సంజయ్ విహారయాత్ర చేస్తున్నట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. బెజ్జంకి మండల అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులను ఎమ్మెల్యేగా తీసుకొచ్చానని రసమయి తెలిపారు. కరీంనగర్ ఎంపీగా మండల అభివృద్ధికి రూ.20లను కూడా బండి సంజయ్ తీసుకురాలేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)