భారత సంతతికి చెందిన రిషి సునక్, ప్రీతి పటేల్ను బ్రిటన్ ప్రధాని తన క్యాబినేట్ మంత్రులుగా తిరిగి నియమించారు. రిషి సునక్ ఇన్ఫోసిస్ సహ భాగస్వామి నారాయణమూర్తి అల్లుడు కాగా, రిషి సునక్ ఇప్పటికే బ్రిటన్ ఆర్థికశాఖామంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన మరోసారి పదవిలో కొనసాగేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రీతి పటేల్ హోం శాఖా కార్యదర్శిగా 2019 జూలై నుంచి పనిచేస్తున్నారు. ఆమెను ఆ పదవి నుండి తొలగిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించినప్పటికీ తిరిగి ఆమె తన పదవిలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు విదేశాంగ శాఖ కార్యిదర్శిగా పనిచేసిన డోమినిక్ రాబ్.. న్యాయశాఖ కార్యదర్శి పదవిని చేపట్టనున్నారు. అలాగే వాణిజ్యశాఖామంత్రిగా లిజ్ ట్రస్ని నియమించారు. ఆమె ఈవారంలోనే భారత వాణిజ్య పరిశ్రమల శాఖామంత్రి పీయుష్ గోయల్తో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపారు.
భారత సంతతికి కేబినెట్ పదవులు
September 16, 2021
0