గెలాక్సీ ఎ52 4జి స్మార్ట్​ఫోన్​ ధర పెంపు

Telugu Lo Computer
0


దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​​ శాంసంగ్ ( తన యూజర్లకు షాకిచ్చింది. శామ్​సంగ్​ మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. శామ్​సంగ్​ భారత మార్కెట్​లోకి ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ A52s 5 జి వేరియంట్​ను రిలీజ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్​ఫోన్​కు అనూహ్యమైన స్పందన వస్తోంది. అయితే, శామ్​సంగ్​ తాజాగా తన గెలాక్సీ A52 ​4 జి వేరియంట్​ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేరియంట్​ ధరను భారత మార్కెట్​లో రూ .1,000 పెంచేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ మార్చిలో విడుదలవ్వగా కొద్ది నెలల్లోనే రూ. 1000 ధర పెరగడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)