చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. జగన్ వైఖరితో నదీ జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్తో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో వ్యవసాయరంగ అభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టన్నారు. అలాగే ఐకాన్ బ్రిడ్జి ప్లాట్ఫామ్ను ధ్వంసం చేయడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని వ్యాఖ్యానించారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నేతలు తప్పుబట్టారు.
Post a Comment
0Comments
3/related/default