ఛాయ్, సమోసా అమ్ముతూ..
July 22, 2021
0
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులోని కొందరు కాఫీ, టీ, సమోసా, ఛాట్ సమోసా అమ్ముకునే వ్యాపారులు వందలకోట్ల ఆస్తులు కూడబెట్టి ఆదాయ పన్ను ఎగొట్టేశారు. చిన్న వ్యాపారులు కదా వాళ్ళేమి కడతారులే అనుకున్నారేమో ఇంతకాలం పెద్దగా వారిపై అధికారులు దృష్టి సారించలేదు. అయితే అనూహ్యంగా జరిపిన దాడుల్లో అసలు వ్యవహారం బట్టబయలవటంతో అధికారులు కంగుతిన్నారు. మొత్తం 256 మంది వ్యాపారుల వివరాలను పరిశీలించగా వారికి సంబంధించిన వందలకోట్ల విలువైన ఆస్తుల పత్రాలు లభించాయి. జీఎస్టీ చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహించినట్లు కనుగొన్నారు. ప్రాధమిక దర్యాప్తులో వీరికి 375కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, ప్రస్తుతం దాడులను కొనసాగిస్తున్నారు.