కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లిలో కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ప్రారంభ సూచికగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ జవ్వాజి శేఖర్ టెస్ట్ చేయించుకోగా అతని ముక్కులో పెట్టిన స్వాబ్ పుల్ల విరిగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు సర్పంచ్ను కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్కాన్ చేసిన వైద్యులు ముక్కులో విరిగిపోయిన స్వాబ్ పుల్లను ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. కరోనా టెస్ట్ క్యాంప్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ ముక్కులో స్వాబ్ విరిగిపోయిందని భావిస్తున్నారు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పుల్లను వైద్యులు వెలికి తీయడంతో సర్పంచ్ ఊపిరిపీల్చుకున్నారు.