కర్ణాటక ప్రభుత్వం బ్లాక్ఫంగస్ వైరస్ టెస్టింగ్లకు ఫీజులు ఖరారు చేసింది. బ్లాక్ఫంగస్ సోకితే మెదడుకు, సైనస్, కంటికి ఎంఆర్ఐ పరీక్షలు చేయాల్సి ఉంటుందని మూడింటికి కలిపి రూ.7,500గా ఫీజు నిర్ణయించారు. ఏపీల్కార్డు దారులకు రూ. 10వేలుగా ఖరారు చేశారు. బీపీఎల్ కార్డుదారులు బ్లాక్ఫంగస్ టెస్టింగ్లు చేయించుకోవాల్సి వస్తే బ్రెయిన్ ఎంఆర్ఐ స్కానింగ్కు రూ.3 వేలు, పారామీసల్ సైనస్కు రూ.3వేలు, కంటికి ఎంఆర్ఐ స్కానింగ్కు రూ.3వేలుగా నిర్ణయించారు. మూడింటికీ కలిపి పరీక్షలు జరిపించుకుంటే రూ.7,500గా నిర్ణయించారు. ఏపీఎల్ కార్డుదారులకైతే ఒక్కో టెస్టింగ్కు రూ.4వేలుగా ఖరారు చేసి, మూడింటికీ కలిపి రూ. 10వేలుగా నిర్ధారించారు.