అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్లను మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి అటా ప్రతినిధులుద అందించారు. మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు అటా ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా నివారణ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని కొనియాడారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.