అమెరికా తెలుగు అసోసియేషన్ సాయం !

Telugu Lo Computer
0

 

అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్లను  మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద   టీటీడీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డికి అటా ప్రతినిధులుద  అందించారు.   మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ  త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు అటా ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ వైవి. సుబ్బారెడ్డి  మాట్లాడుతూ కరోనా నివారణ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని కొనియాడారు.  ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)