షాకయ్యారు...!
يونيو 02, 2021
0
చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో స్థానికులు షాక్ అయ్యారు. జగ్గయ్యపేట, క్రిస్టియన్ లోని ముత్యాల గిరిజమ్మ (72)కు కరోనా సోకడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మే 12న చేర్చారు మధ్య మధ్యలో గిరిజమ్మ భర్త గడ్డయ్య ఆసుపత్రికి వెళ్లి కావలసినవి ఇచ్చి వచ్చేవాడు. ఈ క్రమంలో తిరిగి 15న ఆసుపత్రికి వెళ్ళాడు. బెడ్ మీద గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని అడగ్గా, వేరే వార్డుకు మార్చారేమో చూసుకోమని పంపించేశారు. అన్ని వార్డులు తిరిగి కనిపించక పోవడంతో, తిరిగి సిబ్బందిని అడగ్గా మార్చురీ లో చూడాలన్నారు. మార్చురీలో గిరిజమ్మ పోలిన మహిళ మృతదేహాన్ని చూసి, తన భార్యనని గడ్డయ్య ఖరారు చేయడంతో ఆసుపత్రి సిబ్బంది డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. మృతదేహాన్నితీసుకెళ్లి దహన సంస్కారాలు కూడా చేశారు. గిరిజమ్మ కుమారుడు రమేష్ మే 23న కరోనాతో చనిపోయాడు. ఇద్దరికి కలిపి నిన్న పెద్ద కర్మ చేశారు. ఇదిలా ఉండగా గిరిజమ్మ ఆసుపత్రిలో కోలుకుంది. తనను చూడడానికి ఎవ్వరు రాకపోవడంతో తానె ఆటోలో ఇంటికి చేరుకుంది. గిరిజమ్మము చూసిన స్థానికులు షాక్ కు గురైయ్యారు.