ఆదివారం పెట్రోల్ పై రూ.36 పైసలు.. డీజిల్ పై రూ.26 పైసలు ధరలు పెరగగా దీంతో చాలా ప్రాంతాల్లో డీజిల్ సెంచరీ కొట్టేసింది. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా పరుగులు మాత్రం ఆగడంలేదు. పెట్రోల్ బాటలో డీజిల్ కూడా సెంచరీ కొట్టేసింది. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్లోని గంగానగర్లో డీజిల్ ధర వారం కిందటే రూ.100 దాటేయగా.. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.109.30, డీజిల్ రూ.101.85 చొప్పున ఉంది. ఇక నేడు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి.