సరిహద్దుల్లో వాహనాల రద్దీ

Telugu Lo Computer
0


తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోదాడ మండలం రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డరోడ్డు వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ పాసులుంటేనే తెలంగాణ రాష్ట్రంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.తెలంగాణ పోలీసులు నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంతో మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. తెలంగాణలోకి ప్రవేశించేందుకు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి-65 రామాపురం అడ్డరోడ్డుకు మాత్రమే అనుమతివ్వవడంతో వాహనాల రద్దీ గతవారం తరహాలోని పెరిగిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)