కాంగ్రెస్ లేని కూటమి అసంపూర్ణం
June 26, 2021
0
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు. కూటమిలో కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకమైనదని రౌత్ అభిప్రాయపడ్డారు. బీజేపీని అధికారంలోంచి దించగల బలమైన కూటమిని తయారు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కసరత్తు ముమ్మరంగా సాగుతుంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలతో తాజాగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో థర్డ్ ఫ్రంట్ పైనే చర్చించినట్లు సమాచారం. మరోవైపు శరద్ పవార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పలు మార్లు భేటీ అయ్యారు.
Tags