ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది?.

Telugu Lo Computer
0


ఐదు శాతం కరోనా పేషంట్లలో ఆక్సిజన్ తగ్గటానికి కారణం మైక్రో థ్రోంబై. అంటే కంటికి కనిపించనంత చిన్నటి రక్తం ముద్దలు. 

రక్త కణాలు ఒకదానిపై ఒకటి అతుక్కుపోయి ముద్దగా ఏర్పడటాన్ని థ్రాంబస్ అంటారు. అది కంటికి కనిపించేంత పెద్దగా ఒక రక్తనాళంలో ఏర్పడినపుడు ఆ రక్తనాళానికి అడ్డంగా పడి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. హార్ట్ అటాక్ లో అలాగే పక్షవాతంలో జరిగేది ఇదే. పెద్ద థ్రాంబస్ ఒకటి గుండె రక్త నాళంలో చేరితే హార్ట్ అటాక్ అలాగే మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వస్తుంది.

కానీ కరోనాలో ఇలాంటి రక్తపు ముద్దలు చాలా చిన్నవిగా మైక్రో సైజులో ఉంటాయి. ఇవి చిన్న రక్తనాళాల్లో అడ్డుపడతాయి. 

మన శ్వాస సరిగా జరగాలంటే శ్వాసను నడిపించే కండరాలు ఉంటాయి. ఈ కండరాలలో కూడా ఈ రక్తపు ముద్దలు చేరి ఆ కండరాలకు రక్త సరఫరాలో అంతరాయం కలిగిస్తాయి. అందువలన అవి సరిగ్గా పనిచేయలేవు. 

అంతే కాకుండా ఊపిరితిత్తుల చుట్టూ  చిన్న చిన్న రక్తనాళాలు ఒక జాలిలా చుట్ట చుట్టుకుని ఉంటాయి.  (capillaries) గాలిలో ఉండే ఆక్సిజను ఇక్కడే రక్తంలోకి చేరేది. ఈ కాపిల్లరీలలో కూడా మైక్రో థ్రోంబై అంటే సన్నటి రక్తపు ముద్దలు ఏర్పడతాయి. అందువలన పీల్చుకున్న గాలిలోని ఆక్సిజను రక్తంలో చేరకుండా ఈ మైక్రో థ్రోంబై అడ్డుపడతాయి.

ఈ రెండు కారణాలవలన ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఏ కారణం వలన ఆక్సిజన్ పడిపోతుందో తెలిస్తేనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటుంది. తెలియకుండా చికిత్స చేసేది అంటూ ఏమీ ఉండదం.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)