చచ్చిన పాము తిన్నందుకు అరెస్ట్

Telugu Lo Computer
0


తమిళనాడులోని మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు(50) అనే వ్యవసాయ కూలీ చచ్చిన పాము తిన్నందుకు అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.కొవిడ్‌ 19 నివారణకు పాములు విరుగుడుగా పని చేస్తాయని, వైరస్‌ నుంచి తనను తాను కాపాడుకోవడానికే ఆ పామును తింటున్నానని చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో  చనిపోయిన పామును అతడు తింటున్నట్లు ఆ వీడియోలో రికార్డయింది. ఆ వీడియోను చూసిన జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్‌ ఆనంద్‌ అధికారులను పంపి అతణ్ని అరెస్టు చేశారు. దీంతోపాటు అతడికి రూ.7 వేలు జరిమానా సైతం విధించారు. అయితే ఆ పామును తినాలని తనను కొందరు బలవంతం చేసినట్లు చెప్పాడని ఆనంద్‌ తెలిపారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నానని చెప్పిన్నట్లు పేర్కొన్నారు. అయితే పాములో విషం ఉన్న భాగాన్ని నోటితో తాకకపోవడంతో అతడికి ఎలాంటి హానీ జరగలేదని ఆనంద్‌ తెలిపారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)