ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఇటీవల కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చీరాల టికెట్ ఆశించారు. కానీ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమంచి 2014లో పోటీ చేసి చీరాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు.
వైసీపీకి ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా !
April 04, 2024
0
Tags