హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాలని అణగదొక్కాలని బిజెపి ప్రయత్నం చేస్తోంది అని అన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని సిబిఐ, ఈడీలతోనే బిజెపి పాలిస్తోందన్నారు. రాముడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని బిజెపి నేతల మీద సీరియస్ అయ్యారు. రాముడి అక్షింతలు ఫోటోలు ఇచ్చి ఓట్లు అడగడం దారుణమని దమ్ముంటే ప్రధాని మోడీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
రాముడి అక్షింతలు, ఫోటోలు ఇచ్చి ఓట్లు అడగడం దారుణం !
April 12, 2024
0
Tags