ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. గాదె రవీంద్రబాబు అనే వ్యక్తి కారులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇంఛార్జ్ గోవింద్ ప్రమణ్ కుమార్, జి.సుబ్బారెడ్డి స్టాటిక్ సర్వియలెన్స్ టీం, గవర్నర్ పేట సీఐ, ఎస్సై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 26.33 లక్షల నగదు, 2.6 కేజీలు బంగారం, నగదు బంగారం కలిపి 1.6 కోట్లుగా గుర్తించారు. కాగా అంత డబ్బుకు సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సీజ్ చేశారు. అనంతరం ఐటీ డిపార్ట్ మెంట్, జీఎస్టీకి పరిశీలన కోసం సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. పట్టుకున్నారు.
విజయవాడలో భారీగా నగదు పట్టివేత !
March 22, 2024
0
Tags