ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని సీఈసీకి టీడీపీ లేఖ !

Telugu Lo Computer
0


కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ మరో లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని సీఈసీని  టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలు ఎక్కువ శాతం అధికారపార్టీ నాయకుల ఆధీనంలో ఉన్నాయి. మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాలు వరకు మొత్తం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేసేందుకు అధికారపార్టీ వైసీపీ నాయకులు ఇప్పటికే పెద్దఎత్తున స్టాక్ పెట్టుకున్నారు. ఇందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని లేఖలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.ఇక, ప్రభుత్వ ఔట్లెట్స్‌లలో లిక్కర్ అమ్మకాలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సైతం వైసీపీకి చెందిన కార్యకర్తలే. వైసీపీ మీటింగులకు ప్రజలను ప్రలోభపెట్టి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ నాయకులు ఇప్పటికే లిక్కర్ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఐ.ఆర్.టి.ఎస్ అధికారి డి. వాసుదేవ రెడ్డికి రాష్ట్రంలోని అధికార పార్టీ లిక్కర్ మాఫియాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ కుంభకోణంలో ఇతను కీలక పాత్ర పోషిస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రశాతంగా జరగాలంటే లిక్కర్ మాఫియాతో సంబంధాలున్న వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ అమ్మకాలపై, రవాణపై నిఘా పెట్టాలి. మద్యం ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీలలో సైతం ప్రత్యేక అధికారులను పెట్టి మానిటర్ చేయాలి. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే గోడౌన్‌ల్లో దాచి పెట్టిన లిక్కర్ స్టాక్‌లపై దాడులు చేసి సీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విన్నవించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)