పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా జీవిత ఆశయం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవిత ఆశయమని  తెలిపారు. జగన్‌ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి,  ఖర్చులు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు. తన మీద కేసులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ''తుపాను వచ్చి రైతులు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధిత రైతులకు పరిహారం కూడా చెల్లించలేదు. రైతులంటే వైకాపా ప్రభుత్వానికి కనీస గౌరవం లేదు. నేను పట్టిసీమ కట్టానని దానిద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్‌. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రాన్ని గాడిలో పెడతా. మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తా. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం'' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)