యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన మహిళ !

Telugu Lo Computer
0


ర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన 53 ఏళ్ల మహిళ గతంలో ప్రభావవంతమైన వ్యక్తులపై 52 కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారులను ఆ మహిళ కలుస్తుందని, ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత వారిపై ఫిర్యాదు చేస్తుందని ఒక పోలీస్ అధికారి చెప్పారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వీఎస్ ఉగ్రప్ప, ఇద్దరు మాజీ పోలీస్ కమిషనర్ లైన భాస్కర్రావు, అలోక్కుమార్ తో సహా పలువురిపై ఆమె ఇప్పటి వరకు 53 కేసులు పెట్టిందని అన్నారు. ఆ మహిళ తన భర్తతోపాటు పొరుగింటి వారిపై లైంగిక దాడి కేసులతోపాటు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కమిటీకి వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్, డీజీ, ఐజీ కార్యాలయాల్లో పలు ఫిర్యాదులు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు. కాగా, లైంగికదాడి కేసులో సహాయం కోరేందుకు మాజీ సీఎం యెడియూర్పను ఫిబ్రవరి 2న ఆయన నివాసంలో ఆ మహిళ కలిసింది. ఆ సమయంలో 17 ఏళ్ల తన కుమార్తెను యెడియూరప్ప లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)