తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం !

Telugu Lo Computer
0


తెలంగాణలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ పదవులిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)